Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

రాహుల్‌ పాదయాత్రలో పాల్గొన్న సీనియర్‌ నటి పూజాభట్‌

కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర తెలంగాణలో కొనసాగుతోంది. ఇవాళ ఉదయం హైదరాబాద్‌ కూకట్‌పల్లి, జేఎన్టీయూ మీదుగా రాహుల్‌ పాదయాత్ర సాగుతోంది. రాహుల్‌ యాత్రకు విశేష స్పందన వస్తుండగా ఇవాళ యాత్రలో పాల్గొన్నారు బాలీవుడ్‌ నటి పూజా భట్‌. రాహుల్‌తో కలిసి హైదరాబాద్‌ రోడ్లపై నడిచిన పూజా%ౌౌ%జోడోయాత్రకు సంఫీుభావం ప్రకటించారు. కొంతదూరం రాహుల్‌తో కలిసి నడవగా వీరిని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఫోటోలు దిగేందుకు పోటీపడ్డారు. ఇక త్వరలోనే పూజా కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. యాత్రలో భాగంగా జేఎన్‌టీయూ మెట్రో స్టేషన్‌ వద్ద రోడ్డు పక్కన రాహుల్‌ టీ తాగారు. కాగా ఇవాళ రాహుల్‌ పాదయాత్ర మియాపూర్‌, రామచంద్రపురం, పఠాన్‌చెరు వరకు సాగనుంది. సాయంత్రం 7 గంటలకు హరిదోశ ముత్తంగి వద్ద కార్నర్‌ మీటింగ్‌లో రాహుల్‌ పాల్గొననున్నారు. అనంతరం రుద్రారమ్‌ గణేష్‌ మందిర్‌లో రాహుల్‌ గాంధీ రాత్రికి బస చేయనున్నారు. ఇక ఇటీవలె యాత్రలో రాహుల్‌ యాత్రలో పాల్గొన్నారు నటి పూనమ్‌ కౌర్‌. చేనేత సమస్యలపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరానని ఈ సందర్భంగా ఆమె వెల్లడిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img