Friday, April 19, 2024
Friday, April 19, 2024

రేపటి నుంచి రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు : హరీశ్‌రావు

రేపటి నుంచి రైతుల ఖాతాల్లో రైతుబంధు సాయాన్ని జమచేసి, అన్నదాతలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఎంపీపీ బీబీ పాటిల్‌, ఎమ్మెల్యే మాణికర్‌రావు, చేనేత కార్పొరేషన్‌ చైర్మన్‌ చింత ప్రభాకర్‌తో కలిసి సంగారెడ్డి జిల్లా కోహిర్‌ మండలం దిగ్వాల్‌లో డబుల్‌ బెడ్రూం ఇండ్ల ప్రారంభించి, లబ్ధిదారులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హైదరాబాద్‌లోని గేటెడ్‌ కమ్యూనిటీలా డబుల్‌ బెడ్రూం ఇండ్లను నిర్మించినట్లు చెప్పారు. కాంగ్రెస్‌ హయాంలో ఇలాంటి ఇండ్లను చూశారా అంటూ మంత్రి ప్రశ్నించారు. అప్పట్లో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇల్లు రావాలంటే లంచాలు ఇవ్వాల్సి వచ్చేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని స్పష్టం చేశారు. త్వరలోనే స్థలాలున్న వారికి ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. రూ.5.60కోట్ల వ్యయంతో కోహిర్‌లో 88 డబుల్‌ బెడ్రూం ఇండ్లను నిర్మించినట్లు మంత్రి చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img