Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

రేపిస్టులకు బెయిల్‌ ఇవ్వకుండా పకడ్బందీ చట్టం చేయాలి : కేటీఆర్‌

రేపిస్టులకు బెయిల్‌ ఇవ్వకుండా పకడ్బందీ చట్టాన్ని తయారు చేయాలని రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ తన ట్వీట్‌లో తెలిపారు. జువైనెల్‌ చట్టం, ఐపీసీ, సీఆర్పీసీలోనూ లోపాలు ఉన్నట్లు వెల్లడిరచారు. అందుకే రేపిస్టులకు బెయిల్‌ ఇవ్వకుండా పకడ్బందీ చట్టాన్ని తయారు చేయాలని తాను డిమాండ్‌ చేస్తున్నట్లు పేర్కొన్నారు. జూబ్లీహిల్స్‌ రేప్‌ ఘటన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వంపై ఇటీవల ఆన్‌లైన్‌లో ట్రోలింగ్‌ జరిగింది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌ తన ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. జూబ్లీహిల్స్‌ ఘటన కేసులో రేపిస్టులను శరవేగంగా అరెస్టు చేశామన్నారు. ఆ నిందితుల్ని జైలుకు కూడా పంపినట్లు మంత్రి తెలిపారు. అయితే 45 రోజుల తర్వాత హైకోర్టు ఆ రేపిస్టులకు బెయిల్‌ మంజూరు చేసినట్లు వెల్లడిరచారు. చట్టం ప్రకారం రేపిస్టులకు శిక్షపడే వరకు తమ ప్రభుత్వం పోరాడుతుందని తెలిపారు. రేప్‌ కేసులో దోషిగా తేలిన వ్యక్తి తుదిశ్వాస విడిచే వరకు జైలులో ఉండాలన్నారు. జీవిత ఖైదు శిక్షను నిజమైన రీతిలో అమలు చేయాలని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img