సీఎం కేసీఆర్ రేపు (శుక్రవారం) దిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఆయనతోపాటు బోయిన్పల్లి వినోద్ కుమార్ వెళతారు. ఈరోజే సీఎం దిల్లీకి వెళ్లాల్సి ఉండగా… అనివార్య కారణాల వల్ల పర్యటన రద్దు అయ్యింది. థర్డ్ఫ్రంట్లో భాగంగా ముఖ్యమంత్రి హస్తినకు వెళ్తున్నారని సీఎంవో వర్గాలు చెబుతున్నాయి. సీఎం కేసీఆర్ వెంట పలువురు ఎంపీలు, మంత్రులు దిల్లీకి వెళ్లే అవకాశం ఉంది.