టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్రెడ్డి కరోనా బారినపడ్డారు. రేవంత్కు నిన్నటి నుంచి జ్వరంతోపాటు కరోనా స్వల్ప లక్షణాలున్నాయి. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విటర్ వేదికగా వెల్లడిరచారు. దీంతో కొవిడ్ పరీక్ష చేయించుకోగా పాజిటివ్ తేలిందని రేవంత్ ట్వీట్ చేశారు. ఇటీవలి కాలంలో ఆయన రచ్చబండ కార్యక్రమంతో పాటు బాధిత రైతు కుటుంబాలను పరామర్శించడం వంటివి చేస్తున్నారు. ఈ క్రమంలోనే హౌస్ అరెస్ట్లు, పెద్ద ఎత్తున కార్యకర్తలు రేవంత్ ఇంటికి రావడం, ఆయనను కలవడం వంటివి జరుగుతున్నాయి. ఇటీవల తనను కలిసిన వారు కరోన టెస్ట్ చేయించుకోవాలని ఆయన సూచించారు.