తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డ్డి ఇంటిని ముట్టడిరచడానికి ప్రయత్నించిన టీఆర్ఎస్ కార్యకర్తలను అక్కడే ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పరిస్థిఇ తీవ్ర ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రెండు వర్గాలను అడ్డుకుని పరిస్థితిని చక్కదిద్దారు. డ్రగ్స్ వార్కు సంబంధించి రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కర్రలు, రాళ్లతో పరస్పర దాడులు చేసుకున్నారు. పోలీసులు రంగప్రవేశం చేసి స్వల్ప లాఠీ చార్జ్ చేసి.. ఇరు వర్గాలను చెల్లా చెదురు చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.