టీపీసీసీ చీఫ్, కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి జూబ్లిహిల్స్లోని తన నివాసం నుంచి ఎర్రవల్లికి బయల్దేరుతుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవాళ ఎర్రవెల్లిలో రచ్చబండకు రేవంత్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఈ ఉదయం జూబ్లీహిల్స్లోని ఆయన ఇంటిని పోలీసులు మోహరించి గృహనిర్బంధం చేశారు. సోమవారం తెల్లవారుజామునుంచే పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్లు చేశారు. అయితే ఎర్రవెల్లి వెళ్లేందుకు ఆయన కార్యకర్తలతో కలిసి బయటికి రాగా పోలీసులు అడ్డుకున్నారు. రేవంత్ బయటకు రాగానే అరెస్ట్ చేసిన పోలీసులు భారీ బందోబస్తుతో తరలించారు. ఈ క్రమంలో పోలీసులు-కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. దీంతో రేవంత్ ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఆయన్ను ఎక్కడికి తరలించారన్న విషయం మాత్రం తెలియరాలేదు.