రైతులు ఆయిల్ ఫామ్ను పెద్ద ఎత్తున సాగు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రిహరీశ్ రావు అన్నారు. గురువారం దుబ్బాక మండలం పోతరెడ్డిపేట గ్రామంలో 50 మంది డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు చేయించారు. అనంతరం పోతరెడ్డిపేట క్లస్టర్ రైతు వేదికను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధం తర్వాత వంటనూనె ధరలు విపరీతంగా పెరిగి పోతున్నాయి. ఈ మధ్యకాలంలో మలేషియా, ఇండోనేషియాలు ఆయిల్ ఫామ్ ఎగుమతి నిషేధించాయి. కారణం వంటనూనె ధరల పెంపు, తమదేశ ప్రజలకే వంటనూనె అవసర రీత్యా ఆయా దేశాలు వంటనూనె ఎగుమతిని నిషేధించాయన్నారు. ఈ క్రమంలో భారతదేశంలో వంటనూనెలకు పెద్ద ఎత్తున కొరత ఏర్పడుతున్నదని తెలిపారు. దీంతో ఆయిల్ ఫామ్ సాగుకు మంచి డిమాండ్ ఏర్పడిరదని చెప్పారు. ఆయిల్ ఫామ్ సాగులో రైతులకు ధర రాదని, కొనుగోళ్లు జరగవనీ అనుమానం అక్కరలేదన్నారు. దేశంలో 10 లక్షల ఎకరాలలో ఆయిల్ ఫామ్ సాగు చేసే అవకాశం ఉంది. ఈ దరిమిలా సిద్దిపేటలో ఆయిల్ ఫామ్ నర్సరీ పెట్టి 20 వేల ఎకరాలకు సరిపడేలా తోటలు పెంపకం చేస్తున్నామన్నారు. కాగా రాష్ట్రంలో ఆయిల్ఫామ్ ప్లాంటేషన్ చేపట్టే రైతులకు మరింత విస్తృత సమాచారం అందించేందుకు ప్రత్యేక మొబైల్ యాప్ రూపొందిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమార్ తెలిపారు. ప్రస్తుత 2022`23 ఆర్థిక సంవత్సరంలో ఐదులక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ ప్లాంటేషన్ ను చేపట్టాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విధించిన లక్ష్యం పై నేడు ఆర్థిక, వ్యవసాయ, పరిశ్రమలు, ఉద్యానవనశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.