రైతుల ఇండ్లు బంగారు వాసాలు చేస్తానన్న దొర కేసీఆర్ అని.. రైతులు అదే వాసాలకు ఉరివేసుకొంటుంటే ఆదుకోవడం చేతకావడం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్పై వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజకీయ డ్రామాల కోసం ఆయనకి ఉత్తరాది రైతులకు డబ్బులు ఇవ్వడానికి చేతనౌతుంది…కానీ ఇక్కడి నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. నోటిఫికేషన్స్ ఇవ్వడం చేతకాని ఆయనకు . తన కుటుంబానికి పదవులు ఇచ్చుకోవడానికి చేతనౌతుందని అన్నారు. రైతులు చస్తుంటే ఆదుకోవడం చేతకాని తమరు రైతు నేస్తం అని చెప్పుకోవడానికి సిగ్గుండాలని మండిపడ్డారు. విద్యార్థులనఆత్మహత్యల బాట పట్టిస్తున్నందుకు మీ గుండెలు రాతి బండలు అయ్యుండాలని విమర్శించారు.