మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించడం . కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక, నిరంకుశ వైఖరిపై సాధించిన అద్భుత విజయమని, రైతుల పోరాటం దేశంలోనే ప్రజలందరికి స్ఫూర్తిదాయకమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు. రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకుంటే సరిపోదని, కార్మిక కోడ్లను, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పట్టువిడవకుండా రైతు సంఘాలు, రాజకీయ పార్టీలు చేసిన ఉద్యమాలకు కేంద్రం దిగిరాక తప్పలేదన్నారు.చలికి, వానకు, ఎండకు తట్టుకొని రైతులు ఏడాదిపాటు ఉద్యమాలు చేశారని, లఖింపూర్ ఘటన, ఇతర ఘటనలలో రైతులు మృతువాతపడ్డారని గుర్తుచేశారు. పోరాటంలో అసువులు బాసిన రైతు కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆలస్యంగాన్కెన ఈ చట్టాలను వెనుకకు తీసుకొక తప్పని పరిస్థితి. ప్రజావ్యతిరేక చట్టాలు తీసుకొస్తే, ప్రజల నుంచి ఇలాంటి ఉద్యమాలు తప్పవని పాలకులు గ్రహించాలన్నారు.