ఎమ్మెల్యే మదన్రెడ్డి
కేంద్రం వద్దన్నా రైతులు నష్టపోకూడదనే సీఎం కేసీఆర్ ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకున్నారని ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు.వచ్చే యాసంగిలో రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలన్నారు. కొల్చారం మండల పరిధిలోని కొంగోడు, నాయిన్జలాల్పూర్, పోతిరెడ్డిపల్లి, వసురాంతండా, కొల్చారం, వెంకటాపూర్, పోతంశెట్పల్లి, అప్పాజిపల్లి, కిష్టాపూర్, రాంపూర్, చిన్నాఘన్పూర్, సంగాయిపేట, కోనాపూర్, ఏటిగడ్డమాందాపూర్, రంగంపేట గ్రామాల్లో ఫ్యాక్స్, ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం ఎమ్మెల్యే మదన్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతు సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు.