కేంద్రమంత్రికి కెేటీఆర్ లేఖ..
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి బడ్జెట్లోనూ రైల్వే ప్రాజెక్టుల నిధుల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి తీవ్రమైన వివక్ష కొనసాగుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై కేటీఆర్ రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్కు సోమ వారం ఒక లేఖ రాశారు. తెలం గాణలోని రైల్వే ప్రాజెక్టులకు ప్రతి బడ్జెట్లో జరిగిన తీవ్రమైన అన్యా యాన్ని లేఖలో కేటీఆర్ ప్రస్తావించారు. కనీసం ఈసారైనా కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి తగినన్ని నిధులను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.