Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

రైస్‌ మిల్లు నిర్మాణానికి మంత్రి కేటీఆర్‌ భూమి పూజ..

రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్నారు. దళితుల్లో ఆర్థిక సాధికారత, స్వావలంబన సాధించేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన దళిత బంధు పథకంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా, ఎల్లారెడ్డిపేట మండలం, పదిరకు చెందిన దళిత బంధు లబ్ధిదారులు నిర్మించుకోనున్న రా రైస్‌ మిల్లు నిర్మాణానికి మంత్రి కేటీఆర్‌ భూమి పూజ చేశారు. అంతకుముందు రాజన్న సిరిసిల్ల జిల్లా, ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నిర్మించిన స్వాగత తోరణాన్ని మరియు కూడలిలో ఏర్పాటు చేసిన ఫౌంటెన్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img