రేవంత్ రెడ్డి
నగరం నడిబొడ్డున దివంగత మాజీ సీఎం రోశయ్య స్మృతివనం నిర్మిస్తేనే ఆయనకు నిజమైన గౌరవమని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. దివంగత నేత, మాజీ సీఎం రోశయ్య సంస్మరణ సభ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం రోశయ్యకు స్మృతివనం నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రోశయ్య..ఇతర ముఖ్యమంత్రులకు ఏమాత్రం తీసిపోని నాయకుడని కొనియాడారు. క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ నేత… గాంధీ కుటుంబానికి పీతిపాత్రుడైన రోశయ్య మరణం గురించి సోనియా గాంధీ తన నుంచి వివరాలు అడిగి తీసుకున్నారన్నారు. కాగా దివంగత మాజీ సీఎం రోశయ్య స్మృతివనం ఏర్పాటు చేయాలన్న రేవంత్ రెడ్డి విజ్ఞప్తిని స్వాగతిస్తున్నానని కేవీపీ రామచంద్రరావు అన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, సీఎం పదవికి రాజీనామా చేసిన తర్వాతనే రోశయ్య ప్రశాంతంగా విశ్రాంతి తీసుకున్నారన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణవార్త ప్రపంచానికి తెలియజేయాల్సి వచ్చినప్పుడు రోశయ్య మనో వేదనకు గురయ్యారని అన్నారు. రోశయ్య సమర్థత మీద నమ్మకంతో వైఎస్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు.