Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

వడ్లు కొనమంటే చేతకాక ధర్నాలు చేస్తున్నారు : షర్మిల

ధాన్యాన్ని కొనుగోలు చేయబోమంటూ ప్రభుత్వ ప్రకటనను నిరసనగా శనివారం ఇందిరాపార్క్‌ ధర్నా చౌక్‌ వద్ద షర్మిల దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ, పండిరచే వరకే రైతు పని..ఆ తర్వాత మద్దతు ధర ఇచ్చి కొనాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని అన్నారు. రైతులు బానిసలుగా తమ కాళ్లు మొక్కితే తప్ప కొనరా అని ప్రశ్నించారు. వడ్లు కొనమంటే చేతకాక కేసీఆర్‌ ధర్నాలు చేస్తున్నారని అన్నారు. ఎందుకు వడ్లు కొనడం చేతకావడంలేదో కేసీఆర్‌ వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మద్దతు ధర అంటే కనీస ధర అని…రైతుకు కనీస ధర ఇస్తామని ప్రకటించి కొనకపోతే ప్రభుత్వం రైతులను మోసం చేసినట్టే అని అన్నారు. భారం అంతా తెలంగాణ ప్రభుత్వం రైతులపై మోపుతోందన్నారు. కేసీఆర్‌కు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా సివిల్‌ సప్లయ్స్‌ ఆడిట్‌ రిపోర్ట్‌ను బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రానికి కేంద్రం ఎంత నిధులు ఇస్తుందో బట్టబయలవుతుందని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img