వడ్ల కొనుగోళ్లపై కేసీఆర్ డ్రామా ఆడుతున్నారని బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ, హుజురాబాద్లో ఓటమి తర్వాత ప్రజలపై టీఆర్ఎస్ ప్రభుత్వం కక్ష కట్టిందన్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.రైతుల ఓట్లతో గెలిచిన కేసీఆర్… రైతుల సమస్యలు ఎందుకు పట్టించుకోరని ప్రశ్నించారు. వ్యవసాయం విషయంలో శాస్త్రవేత్తలు, నిపుణులు చెప్పిన మాటలు కేసీఆర్ పట్టించుకోరన్నారు. సమస్య వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వంపై నెపం నెట్టడం కేసీఆర్కు అలవాటని అన్నారు. ధర్నా చౌక్ ఎత్తేసిన ముఖ్యమంత్రి ఎలా ధర్నాలు చేయించారని అన్నారు.