Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో ఎలుకలు..!

వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిలో ఎలుకలు మళ్ళీ అలజడి సృష్టిస్తున్నాయి. రోగుల మధ్యే తిరుగుతూ వారిని భయాందోళనలకు గురిచేస్తున్నాయి. మార్చి 31న పేషెంట్‌ శ్రీనివాస్‌ను ఎలుకలు కొరకడంతో తీవ్ర రక్తస్రావమై పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై అప్పట్లో తీవ్రంగా స్పందించిన ప్రభుత్వం ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను బదిలీ చేయడంతో పాటు ఇద్దరు డాక్టర్లను సస్పెండ్‌ చేశారు. ఎలుకల నివారణకు బోన్లు పెట్టి ఐసీయూ ఇతర వార్డుల్లోకి ఎలుకలు రాకుండా చర్యలు చేపట్టారు. అయితే సిబ్బంది నిర్లక్ష్యంతో మళ్లీ ఎలుకలు హల్‌చల్‌ చేస్తున్నాయి. వార్డుల్లో ఎలుకలు యథేచ్చగా తిరుగుతుండటంతో రోగులు, వారి బంధువులు ఆందోళణ చెందుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img