Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

వరద గుప్పిట్లో భద్రాచలం.. బాహ్య ప్రపంచంతో రాకపోకలు బంద్‌ !

భద్రాచలం పట్టణాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. వరద నీటితో భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. గురువారం ఉదయం 9 గంటలకు 17,58,166 క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతుండగా నీటిమట్టం 59.40 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు. ఎడతెరిపిలేని వర్షాలతో భద్రాచలంలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. వరద పోటుతో రహదారులు సైతం తెగిపోవడంతో భద్రాచలానికి వచ్చే రెండు మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి.కూనవరం, చర్ల వైపు నుంచి భద్రాచలం వచ్చే రోడ్లు తెగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రస్తుతం కొత్తగూడెం నుంచి మాత్రమే భద్రాచలానికి రాకపోకలు కొనసాగుతున్నాయి. తాజాగా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 60 అడుగులకు చేరింది. అయితే వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతుండటంతో ఈరోజు సాయంత్రానికి 65అడుగులకు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే కొత్తగూడెం లింక్‌ రోడ్డు కూడా తెగిపోయే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. దీంతో ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియక భద్రాచలం ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img