హైదరాబాద్ నగరంలో చైన్ స్నాచర్లు హడలెత్తిస్తున్నారు. సీటిలోకి ఎంటర్ అయిన చైన్స్నాచర్ల ముఠా.. వరుస దొంగతనలతో రోచ్చిపోయింది.. ప్లానింగ్ ప్రకారం.. దొంగతనాలు చేస్తూ భారీగా దోచుకున్నారు.హైదరాబాద్ నగరంలో చైన్ స్నాచర్లు హడలెత్తిస్తున్నారు. సీటిలోకి ఎంటర్ అయిన చైన్స్నాచర్ల ముఠా.. వరుస దొంగతనలతో రోచ్చిపోయింది.. ప్లానింగ్ ప్రకారం.. దొంగతనాలు చేస్తూ భారీగా దోచుకున్నారు. కేవలం రెండుగంటల్లో ఆరు స్నాచింగ్లతో స్నాచర్లు ఠారెత్తించారు. వరుసగా దొంగతనాలకు పాల్పడుతూ.. కనిపించకుండా పారిపోయారు. దీంతో హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలోని ప్రజల్లో భయాందోళన నెలకొంది. అయితే.. ఈ చైన్ స్నాచింగ్ ముఠా ఉప్పల్ పరిధిలోనే 2 చైన్ స్నాచింగ్లకు పాల్పడ్డారు. ఉప్పల్ మాస్టర్ చెఫ్ సమీపంలో దుండగులు మహిళ మెడలో నుంచి బంగారం చైన్ లాక్కెళ్లారు. అనంతరం ఉప్పల్ కళ్యాణపురిలో ఉదయం వాకింగ్కు వెళుతున్న సమయంలో మహిళ మెడలోని పుస్తెల తాడును దుండగులు లాక్కెళ్లారు. ఆతర్వాత నాచారంలోని నాగేంద్రనగర్లో, ఓయూ పరిసరాల్లోని రవీంద్రనగర్లో, చిలకలగూడ రామాలయం వీధిలో, రాంగోపాల్ పేట్ పరిధిలో దొంగలు చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డారు. దుండగులు మాస్కులు ధరించి చోరీలకు పాల్పడ్డారు.