సోము వీర్రాజు వ్యాఖ్యలపై కేటీఆర్ ట్వీట్
ఏపీ బీజేపీ నేతలు మరింత దిగజారిపోయారని తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా విమర్శించారు. మంగళవారం విజయవాడలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాగ్రహ సభలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు లిక్కర్పై చేసిన కామెంట్స్పై పెద్ద దుమారం రేగుతోంది. ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తే చీప్ లిక్కర్ను 50 రూపాయలకే ఇస్తామంటూ సోము వీర్రాజు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. 2024లో బీజేపీకి ఓటు వేయాలని కోరుతూ.. తాము అధికారంలోకి వస్తే ముందుగా ఒక్క క్వార్టర్ సీసాను రూ.75కే ఇస్తామని ఇంకా కుదిరితే రూ.50కే విక్రయిస్తామని అని సోము వీర్రాజు ప్రకటించారు. కాగా సోము వీర్రాజు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురుస్తోంది. సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ‘వావ్ వాట్ ఎ స్కీం..వాట్ ఎ షేమ్.. రూ.50 లకే చీప్ లిక్కర్ భాజపా జాతీయ విధానమా? లేక కేవలం బీజేపీ బలహీనంగా ఉన్న రాష్ట్రాలకి మాత్రమేనా..అధికారం కోసం బంపర్ ఆఫర్ ఇస్తున్నారా? అని ప్రశ్నించారు.