త్వరలో జనసేనాని బస్సు యాత్ర
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తలపెట్టిన బస్సు యాత్ర కోసం వారాహి అనే వాహనాన్ని సిద్ధం చేయడం తెలిసిందే. అయితే ఈ వాహనం రంగుపై ఏపీ అధికార పక్ష నేతల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మిలిటరీ వాహనాలకు వేసే ఆలివ్ గ్రీన్ రంగును ప్రైవేటు వాహనాలకు ఎలా వేస్తారంటూ వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. దీనిపై పవన్ కల్యాణ్ కూడా వైసీపీ నేతలకు ఘాటుగా బదులిచ్చారు. ఈ నేపథ్యంలో, వారాహి వాహనానికి క్లియరెన్స్ లభించింది. వారాహి వాహనానికి రవాణా శాఖకు సంబంధించిన అన్ని అనుమతులు ఉన్నాయని తెలంగాణ డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ పాపారావు వెల్లడిరచారు. వారం రోజుల క్రితమే వారాహి వాహనం రిజిస్ట్రేషన్ పూర్తిచేసుకుందని తెలిపారు. వాహనం బాడీకి సంబంధించిన సర్టిఫికెట్ ను పరిశీలించామని పేర్కొన్నారు.