Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

వారికెందుకు సాయం చేయరు? : వైఎస్‌ షర్మిల

కేసీఆర్‌ జార్ఖండ్‌ పర్యటన పై వైఎస్‌ ఆర్‌ తెలంగాణ పార్టీ అధినేత షర్మిల మండిపడ్డారు. శుక్రవారం జార్ఖండ్‌ కు వెళ్లి గల్వన్‌ లోయలో వీరమరణం పొందిన సైనిక కుటుంబాలకు ఆర్దిక సాయం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ అమర జవాన్ల కుటుంబాలకు రూ.10లక్షలు ఇవ్వడం తప్పుకాదు. అలాగే దిల్లీలో చనిపోయిన రైతులకు పరిహారం అందించడంలో తప్పులేదు.కానీ తెలంగాణ కోసం అమరులైన వారి కుటుంబాలకు ఎందుకు సాయం చేయరని ప్రశ్నించారు. 1200 మంది అమరులని ఉద్యమంలో గొంతు చించుకున్న మీకు అధికారంలోకి వచ్చాక కొందరే అమరులెందుకయ్యారని ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img