Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

విజ‌న్ 2020 తోనే హైద‌రా’బాద్ షా’ – చంద్ర‌బాబు

విజన్‌ 2047 పేరుతో ఇండియన్స్‌ చరిత్ర సృష్టిద్దామని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని గీతం యూనివర్సీటీలో ”కౌటిల్య స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ పాలసీ” అనే విద్యా సంస్థ నిర్వహించిన గ్రాడ్యుయేషన్‌ డే కార్యక్ర మానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తొలుత పట్టభద్రులైన విద్యార్థులకు మెరిట్‌ సర్టిఫికెట్లు, పట్టాలు అందజేశారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ, పబ్లిక్‌ పాలసీ గ్రాడ్యూయేషన్‌ సెర్మనీ అనే అంశంపై తాను తొలిసారి ప్రసంగిస్తున్నానని, పబ్లిక్‌ పాలసీ అనేది ఎంతో శక్తివంతమైనదని, అది భవిష్యత్‌ తరాలను మార్చుతుందన్నారు. కౌటిల్య అర్థశాస్త్ర పితామహు డని ఆయన పేరు ఈ సంస్థ పెట్టుకోవడం ఎంతో అభినందనీ యమన్నారు. ఆయన స్ఫూర్తితో విద్యాసంస్థలో చదువుతున్న ప్రతి ఒక్కరు ముందుకు సాగి లక్ష్యాలను అధిగమించాలని కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img