Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

విజయ గర్జనపై సన్నాహక సమావేశం

టీఆర్‌ఎస్‌ ప్లీనరీ, తెలంగాణ విజయ గర్జనపై నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు కొనసాగుతున్నాయి.ఇవాళ మహేశ్వరం, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌, ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజక వర్గాలకు చెందిన పార్టీ ముఖ్య నాయకులతో కేటీఆర్‌ సమావేశమై దిశా నిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్‌ కుమార్‌, రాజ్య సభ సభ్యులు కేశవరావు, చేవెళ్ల లోక్‌సభ సభ్యులు రంజిత్‌ రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్‌ రెడ్డి, సురభి వాణి దేవి, కుర్మయ్యగారి నవీన్‌ కుమార్‌, యోగానంద్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img