నవంబర్ 15న వరంగల్లో విజయ గర్జన సభ నిర్వహిస్తున్నట్లు పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. 10లక్షల మందితో సభ విజయవంతానికి సన్నాహాలు చేస్తున్నట్టు చెప్పారు. ఇరవై ఏళ్లలో పార్టీ సాధించిన విజయాలను, ప్రభుత్వం సాధించిన ప్రగతిని ముఖ్యమంత్రి కేసిఆర్ పార్టీ శ్రేణులు, ప్రజలకు నివేదిస్తారని మంత్రి తెలిపారు.ఆయన వెంట ఎమ్మెల్సీ పోచంపల్లి, ఎమ్మెల్యే ఆదూరి రమేష్ తదితరులు ఉన్నారు. నగరంలోని మడికొండ, ఉనికిచర్ల శివార్లలోని ఖాళీ స్థలాలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ పరిశీలించారు. భారీ ఎత్తున జనసమీకరణ చేసి సభను విజయవంతం చేయడానికి ఎలాంటి అటంకాలు కలుగకుండా అన్ని హంగులతో సభ నిర్వహించేందుకు అనువైన స్థలాన్ని పరిశీలిస్తున్నారు.