Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

విద్యాభివృద్ధికి పెద్దపీట

విశాలాంధ్ర -అమనగల్లు : ప్రతి పేద విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడంతో పాటు విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తుందని రంగారెడ్డి జిల్లా సాం ఘిక సంక్షేమ స్టాండిరగ్‌ కమిటీ చైర్మన్‌ అను రాధ పత్య నాయక్‌ అన్నారు.సోమవారం అమనగల్లు పట్టణంలోని జిల్లా పరిషత్‌ బాలికల పాఠశాల ను సందర్శించి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలిం చారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకు న్నారు.అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈసం దర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని విద్యార్థులకు విద్యాభివృద్ధి కోసం మౌలిక వసతులు కల్పించడం, వంటి వాటికి పెద్దపీట వేయడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం పద్మ, పిఈటి సుశీల, ఆమనగల్లు మున్సిపాలిటీ టిఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ చుక్క నిరంజన్‌ గౌడ్‌, గుత్తి బాలస్వామి, టిఆర్‌ఎస్‌ మున్సిపాలిటీ ఉపాధ్యక్షులు పూసల భాస్కర్‌, టిఆర్‌ఎస్‌ మున్సిపాలిటీ ఎస్టీ సెల్‌ అధ్యక్షులు నేనావత్‌ రమేష్‌ నాయక్‌,రమేష్‌, అప్రోజ్‌, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img