విద్యార్థులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది.వివిధ కోర్సుల్లో ప్రవేశానికై ఇంటర్లో కనీస అర్హత మార్కుల నిబంధనను తొలగించింది. విద్యార్థులకు ప్రవేశాలు కల్పించడంలో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఎంసెట్ , ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా, ఐదేళ్ల ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో అడ్మిషన్స్ పొందాలంటే ఇంటర్ తత్సమాన కోర్సుల్లో మినిమం పాస్ అయితే చాలు అని పేర్కొంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వార్షిక పరీక్షలు జరగకపోవడం, విద్యార్థులకు పాస్ మార్కులు వేయడం వంటి పరిణామాల నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.