: దాసోజు శ్రవణ్
రాష్ట్రంలో పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ తరపున ఆరు డిమాండ్లు చేశామని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ తెలిపారు. పాత టారిఫ్ పద్ధతిలోనే విద్యుత్ బిల్లులు కొనసాగాలన్నారు. ప్రభుత్వం బకాయి ఉన్న 13 వేల కోట్ల రూపాయల బకాయిలు వెంటనే వసూలు చేసి ప్రజలపై భారం తగ్గించాలన్నారు. .విద్యుత్ సంస్థల ఆర్థికస్థితులపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండు చేశారు. ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసి ఛార్జీలపై చర్చించాలని అన్నారు.