తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి శనివారం తన విధుల్లో చేరారు. సెలవులు ముగించుకుని 2 వారాల తర్వాత మహేందర్ రెడ్డి విధుల్లో చేరినట్లు డీజీపీ కార్యాలయం ప్రకటించింది. ఫిబ్రవరి 18 నుంచి మహేందర్ రెడ్డి సెలవుల్లో ఉన్నారు. మహేందర్ రెడ్డి ఇంట్లో జారిపడటంతో ఆయన ఎడమ భుజానికి గాయం కావడంతో.. వైద్యుల సూచన మేరకు 2 వారాల పాటు విశ్రాంతి తీసుకోని ఇవాళ విధుల్లో చేరారు.