మూడు పార్టీలు రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నాయని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల అన్నారు. నల్లా తిప్పితే మంచినీళ్లు కాదు లిక్కర్ వస్తోందని అన్నారు. నేడు జగిత్యాలలో ఆమె మాట్లాడుతూ.. మతం పేరుతో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజలను రెచ్చగొడుతున్నారన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ.. వీళ్లా పార్టీల అధ్యక్షులు అంటూ మండిపడ్డారు. తెలంగాణలో అసలు కేటీఆర్ ఎవరని షర్మిల ప్రశ్నించారు. కేసీఆర్ లేకపోతే కేటీఆర్కు స్థాయి ఎక్కడిదని నిలదీశారు. తనకు కేటీఆర్తో పోలికేంటని ప్రశ్నించారు. ‘కేసీఆర్ ఇచ్చిన ఒక్క హామీ అయినా నెరవేరిందా? బీజేపీనే కేసీఆర్ తనకు ప్రత్యామ్నాయం అనుకుంటున్నాడు. రాజకీయాలంటే డబ్బులతో కొనడం అనుకుంటున్నారు’ అని షర్మిల పేర్కొన్నారు.