సిద్దిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి రాజీనామా వివాదంపై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. వెంకట్రామిరెడ్డి రాజీనామా ఆమోదించడాన్ని సవాలు చేస్తూ సూబెంధర్ సింగ్, జే.శంకర్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.ఇప్పటికే ఎమ్మెల్సీగా నామినేషన్ ప్రక్రియ పూర్తి అయినందున తాము వేసిన పిటిషన్లో ఫలితం లేదని పిటీషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఎమ్మెల్సీ నామినేషన్ను రద్దు చేయాలన్న పిల్ను ఈ క్రమంలో పిటిషనర్ వెనక్కి తీసుకున్నారు. వరి విత్తనాల అమ్మకుడదంటూ వెంకట్ రామి రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై నమోదైన క్రిమినల్ కంట్మెంట్లో ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అతనితో బేషరతుగా క్షమాపణల స్టేట్మెంట్ నమోదు చేసి హైకోర్టుకు సమర్పిస్తామని ఏజీ తెలిపారు. అనంతరం తదుపరి విచారణను కోర్టు 4 వారాలకు వాయిదా వేసింది