Friday, April 19, 2024
Friday, April 19, 2024

వెయ్యిస్తంభాల గుడికి యునెస్కో గుర్తింపునకు కృషి చేస్తా

ఎంపీ జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌
కాకతీయుల కళావైభవానికి ప్రతీక అయిన వెయ్యి స్తంభాల గుడి అభివృద్ధికి కోటి రూపాయాలను ఎంపి జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌ కేటాయించారు. ఇవాళ వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వరంగల్‌ వచ్చిన ఆయన భద్రకాళీ అమ్మవారిని, రుద్రేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వెయ్యి స్తంభాల గుడిని పరిశీలించిన ఆయన.. అద్భుతమైన కళాకృతులు, శిల్పసంపద కేంద్ర పురావస్తుశాఖ నిర్లక్ష్యానికి గురికావడం.. ఏళ్లకు ఏళ్లు గడుస్తున్న కళ్యాణమండప నిర్మాణం ఎక్కడ వేసిన గంగొళి అక్కడేనన్న చందంగా ఉండటంపై ఆవేదన వ్యక్తం చేశారు. మన చరిత్రను, మన సంస్కృతిని మనమే కాపాడుకోవాలని ఆయన అన్నారు. ప్రపంచ పర్యాటకాన్ని ఆకర్షిస్తున్న వెయ్యి స్తంభాల గుడి అభివృద్ధి మనందరి బాధ్యతగా భావించి ఆలయ అభివృద్ధికి, ఇతర సౌకర్యాల కల్పన నిమిత్తం కోటి రూపాయలను తన ఎంపీ ల్యాడ్స్‌ నుంచి అందించనున్నట్టు తెలిపారు. అంతేకాదు.. ప్రతీ సంవత్సరం కోటి రూపాయలను కేటాయించి ఆలయమ పునర్వైభవానికి తనవంతు సహకారం అందిస్తానని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img