Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

వైఎస్‌ఆర్టీపీలో కమిటీలన్నీ రద్దు..జిల్లాలకు కోఆర్డినేటర్ల నియామకం

తెలంగాణలో రానున్న రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా వైఎస్‌ఆర్టీపీ చర్యలు తీసుకుంటోంది.పార్టీని ప్రక్షాళన చేసే క్రమంలో ఇప్పటి వరకు ఉన్న అన్ని కమిటీలను రద్దు చేస్తున్నట్టు ఆ పార్టీ అధ్యక్షురాలు వైయస్‌ షర్మిల ప్రకటించారు. కమిటీల స్థానంలో జిల్లాలకు కోఆర్డినేటర్లను నియమిస్తున్నట్టు తెలిపారు. . గత ఏడాది పార్టీని ప్రకటించిన తర్వాత పార్లమెంటు నియోజకవర్గాలకు కోఆర్డినేటర్లను నియమించారు. రాష్ట్ర స్థాయిలో అధికార ప్రతినిధులను, సోషల్‌ మీడియా ఇన్చార్జీలను నియమించారు. అయితే ఇప్పుడు అన్ని కమిటీలను ఒక్కసారిగా రద్దు చేయడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img