వైఎస్ షర్మిలతో ప్రశాంత్ కిషోర్ (పీకే) బృందం సంభ్యులు ఇవాళ లోటస్ పాండ్లో భేటీ అయ్యారు. పార్టీ విస్తరణ, పాదయాత్ర, పార్టీ బలోపేతం తదితర అన్ని అంశాలపై ఈ బృందంతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో వైఎస్సార్టీపీ పెట్టిన తర్వాత తన పార్టీ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ వస్తారని షర్మిల మొదటి నుంచి చెబుతున్న విషయం తెలిసిందే.