వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల పోలీసులు అరెస్టు చేశారు. ప్రతి మంగళవారం ఆమె నిరుద్యోగులకు మద్దతుగా దీక్ష చేస్తున్నారు. ఇవాళ బోడుప్పల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ వద్ద దీక్ష చేయనుండగా..పోలీసులు అనుమతి నిరాకరించారు. అయినా నగరంలోని బోడుప్పల్లో దీక్షకు కూర్చున్నారు. సాయంత్రం వరకూ దీక్ష కొనసాగుతుందని ప్రకటించారు. . దీంతో ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు అక్కడికి తరలివచ్చారు. తాము శాంతియుతంగా దీక్ష చేయాలనుకుంటే.. ఎందుకు అనుమతివ్వలేదని ప్రశ్నించేందుకు తర్వాత ఆమె మేడిపల్లి పీఎస్కు బయలుదేరారు. అక్కడ పోలీసులు ఆమెను అడ్డుకోవడంతో షర్మిల, ఆమె పార్టీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.దీంతో పోలీసులు షర్మిలను అరెస్టు చేశారు.