Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

వ్యాక్సినేషన్‌పై సీఎస్‌ సమీక్ష

వ్యాక్సినేషన్‌ పురోగతిని సమీక్షించడంతో పాటు మరింత వేగవంతం చేసేందుకు సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ శుక్రవారం పలు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ ఉదయం హెలికాప్టర్‌లో ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రానికి చేరుకొని ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌ జిల్లాల కలెక్టర్లు, వైద్యాధికారులు, ఇతరశాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. వ్యాక్సినేషన్‌ కొనసాగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. టీకాల పంపిణీని వేగవంతం చేసి, నెలాఖరు వరకు లక్ష్యాన్ని చేరుకోవాలని ఆదేశించారు. అనంతరం మధ్యాహ్నం అక్కడి నుంచి మహబూబ్‌నగర్‌కు బయలుదేరి వెళ్లారు. అక్కడ నాగర్‌కర్నూల్‌, జోగులాంబ గద్వాల్‌, వనపర్తి, నారాయణపేట కలెక్టర్లు, నాగర్‌ కర్నూల్‌, జోగులాంబ గద్వాల్‌, వనపర్తి, నారాయణపేట జిల్లాల కలెక్టర్లతో సమావేశం కానున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img