: అక్బరుద్దీన్ ఓవైసీ
తెలంగాణలో వ్యాక్సినేషన్ అత్యంత వేగంగా సాగుతోందని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ తెలిపారు. బూస్టర్ డోస్ను సోమవారం నుంచి ప్రారంభించామని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీకా కార్యక్రమంలో ముందంజలో ఉన్న ఆరోగ్యశాఖ అధికారులకు అభినందనలు తెలిపారు. కోవిడ్ నియమాలను పాటించాలని ప్రజలకు సూచించారు. టీకా తీసుకుంటే దుష్పరిణామాలు వస్తాయన్నది అవాస్తవమని, కోవిడ్ నుంచి వ్యాక్సిన్ కాపాడుతుందని చెప్పారు.