వ్యాపారంలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు ఇస్తానంటూ కోట్లు వసూలు చేసి మోసం చేసిన వ్యాపారవేత్త శిల్పా చౌదరి అనే మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెతోపాటు పాటు ఆమె భర్తను సైతం హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.రూ. కోటి 5 లక్షలు తీసుకోని తిరిగి ఇవ్వలేదని దివ్య అనే మహిళ నార్సింగి పీఎస్లో ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు గండిపేట సిగ్నేచర్ విల్లాస్లో నివాసం ఉంటున్న శిల్ప,ఆమె భర్తను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. ఆమె బ్యాంకు ఖాతాలను పరిశీలించారు. కాగా తాము మోసపోయామని అంటూ పోలీస్ స్టేషన్లకు ప్రముఖులు క్యూ కడుతున్నారు. సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ఫైనాన్సియర్ల దగ్గర్నుంచి ఈమె డబ్బులు తీసుకొని మోసం చేసిందంటూ పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఫేజ్ త్రీ పార్టీలు ఇచ్చి మరీ సెలబ్రిటీలను శిల్ప ఆకర్షించినట్లు తెలుస్తోంది.