Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఈరోజు భారీగా బంగారం పట్టుబడిరది. 435.760 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు ఓ ప్రయాణికుడు వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న బంగారం విలువ 23లక్షల14 వేల రూపాయలు ఉంటుందని చెప్పారు. షార్జా నుంచి ఓ వ్యక్తి ఎలక్ట్రానిక్‌ పరికరాలతో శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టులో ల్యాండ్‌ అయ్యాడు. అయితే అనుమానం వచ్చిన కస్టమ్స్‌ అధికారులు వాటిని ఓపెన్‌ చేసి చెక్‌ చేయగా అందులో బంగారం ఉంది. దీంతో అక్రమంగా తరలిస్తున్నందుకు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img