తెలంగాణ శాసనసభ నుంచి బీజేపీ సభ్యులను సస్పెండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పిన బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్ రావు అసెంబ్లీలో నినాదాలు చేయడంతో సమావేశాలకు అడ్డుతగులుతున్నారంటూ ఆ ముగ్గురు సభ్యులపై స్పీకర్ సస్పెన్షన్ వేటు వేశారు. ఈ సెషన్ పూర్తయ్యే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ తీరుపై ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్ రావు మండిపడ్డారు. ప్రశ్నించే గొంతులను అణచివేయలేరని చెప్పారు. తమను ఎంతగా అణచివేయాలనుకున్నా తాము అంతగానూ ప్రశ్నిస్తూనే ఉంటామని అన్నారు.