రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శీతాకాల విడిదికి ఈ నెల 20న హైదరాబాద్కు వస్తున్నారు. దీంతో బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో మౌలిక సదుపాయాల ఏర్పాట్లలో ఆయా విభాగాల అధికారులు నిమగ్నులయ్యారు. ఈ సందర్భంగా ఈఎంఈ పరేడ్ గ్రౌండ్లో ప్రత్యేక హెలీప్యాడ్ను సిద్ధం చేశారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ఆక్టోపస్ పోలీసులు రాష్ట్రపతి నిలయంలో మాక్డ్రిల్ నిర్వహించారు.