సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలో మంత్రులు హరీశ్ రావు, సత్యవతి రాథోడ్ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ..గత 5 ఏళ్లలో రు. 36 కోట్లతో రోడ్లు ఏర్పాటు చేశాం. జిల్లాలో 54 తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చామన్నారు. ప్రతి కొత్త బిల్డింగ్కు రూ.25 లక్షలు మంజూరు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. 70 ఏళ్లలో కనీసం ఒక్క గిరిజన పాఠశాల లేదు. భూపాల్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యాక నాలుగు పాఠశాలలు మంజూరైన విషయాన్ని గుర్తు చేశారు. మంచినీళ్ల కోసం ఇక్కడి ప్రజలు ఎంతో ఇబ్బంది పడేవారు. సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచి నీరు అందిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి కష్టం ఉండకూడదని పంట పెట్టుబడి సాయం ఇస్తున్నాం. కానీ, బీజేపీ జూట మాటలు మాట్లాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటకలో ఏముంది? రైతు బంధు ఉందా? రైతు బీమా ఉందా? అని సూటిగా ప్రశ్నించారు.గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాకముందు గిరిజన పల్లెలు ఎలా ఉండే ఇప్పుడు ఎలా మారిపోయాయో ఆలోచించాలన్నారు. ఎస్టీ ప్రజల చిరకాల ఆకాంక్షను సీఎం కేసీఆర్ నెరవేర్చారని అన్నారు.