సమాజాభివృద్ధిలో మహిళల ప్రాధాన్యత మరువలేనిదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీభవన్లో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో రేవంత్ పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. అత్యున్నత చట్టసభల్లో మహిళలకు ప్రాధాన్యం కల్పించింది కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ముగ్గురు మహిళల ప్రాధాన్యత ఉందని.. సోనియా గాంధీ, సూష్మ స్వరాజ్, మీరాకుమార్ వల్లే తెలంగాణ ఏర్పడిరదని ఆయన అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్ద పీట వేస్తూ ఆరుగురు మంత్రులకు అవకాశం కల్పించిందని గుర్తుచేశారు. కాంగ్రెస్కు ఎప్పుడు అవకాశం వచ్చినా.. మహిళలకు పెద్దపీట వేసిందని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో మహిళా భద్రత లేకుండా పోయిందన్నారు. సిటీ నడిబొడ్డున సింగరేణి కాలనీలో ముక్కు పచ్చలారని చిన్నారి హత్యకు గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తాగుబోతులను తయారు చేసి.. మహిళల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారన్నారు.