ఈనెల 7వ తేదీ నుండి ప్రారంభం కానున్న సమావేశాల నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, పోలీసు శాఖ అధికారులతో శాసనసభ భవనంలోని కమిటీ హాల్ శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి సమావేశం నిర్వహించారు. .ఈసందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ.. ఈ నెల 7 నుంచి రాష్ట్ర రెండో శాసనసభ 8వ సెషన్, శాసనమండలి 18వ సెషన్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయని చెప్పారు. గత సమావేశాలు సజావుగా జరుగడానికి సహకరించిన అధికారులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. గత సమావేశాల్లో మాదిరిగానే అధికారులు సహకారం అందించాలని కోరారు. గౌరవ సభ్యులు అడిగిన సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా అందించాలన్నారు. గత సమావేశాలకు సంబంధించి పెండిరగ్లో ఉన్న ప్రశ్నలకు జవాబులను వెంటనే పంపించాలని సూచించారు. కరోనా ప్రభావం తగ్గినప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అందుకోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఆరోగ్యశాఖ అధికారులు కరోనా టెస్టింగ్ సెంటర్ను ఏర్పాటు చేయాలని సూచించారు. శాసనసభ, మండలి సమావేశాలు సజావుగా సాగేందుకు పోలీస్ శాఖ వారు పూర్తి సహాయ, సహకారాలను అందించాలని కోరారు.