Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

సమైక్యత ఉత్సవాలను బీజేపీ హైజాక్‌ చేసేందుకు ప్రయత్నిస్తోంది : ఎమ్మెల్సీ కవిత

టీఆర్‌ ఎస్‌, బీజేపీ హైదరాబాద్‌లో ఈ రోజు పోటాపోటీ వేడుకలు నిర్వహిస్తున్నాయి. టీఆర్‌ ఎస్‌ ఆధ్వర్యంలో జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలు జరుగుతుండగా.. బీజేపీ.. తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు చేపట్టింది. రెండు కార్యక్రమాల్లో ఇరు పార్టీలు ఒకరిపై మరొకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేయడంతో రాజకీయాలు వేడెక్కాయి. ఈ క్రమంలో బీజేపీపై ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ తమకు అలవాటైన ‘‘ఎన్నికల ఉత్సవాలు’’ అన్న సహజ సూత్రాన్ని ఇక్కడా అమలు చేసి తెలంగాణలో హైదరాబాద్‌ సమైక్యత దినోత్సవ వేడుకలను హైజాక్‌ చేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రాష్ట్రాలకువచ్చి హామీలివ్వడం, ప్రజలు వారిని తిరస్కరించగానే, వంచించడం బీజేపీకి అలవాటుగా మారిందని ఆమె ఎద్దేవా చేశారు. కేంద్ర మంత్రి అమిత్‌ షా ప్రస్తుతం హైదరాబాద్‌ లో ఉన్న నేపథ్యంలో ఆయన, బీజేపీ కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. స్వాతంత్రోద్యమంలో మీ పాత్ర ఏమిటి? హైదరాబాద్‌ సమైక్య ఉద్యమంలో బీజేపీ నేతల పాత్ర ఉందా? తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఏమిటో చెప్పాలంటూ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నాస్త్రాలు సంధించారు. తెలంగాణ బిడ్డగా వీటికి సమాధానాలు తెలుసుకోవాలని అనుకుంటున్నట్లు ట్వీట్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img