Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

సమ్మర్‌ స్పెషల్‌.. మదురై-సికింద్రాబాద్‌ మధ్య రైళ్లు

వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకుని మదురై-సికింద్రాబాద్‌ మధ్య ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. మే 2, 9, 16, 23, 30, జూన్‌ 6, 13, 20, 27, జులై 4, 11, 18, 25 తేదీల్లో సాయంత్రం 9.25 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరే వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ (07191) మరుసటి రోజు సాయంత్రం 8.45 గంటలకు మదురై జంక్షన్‌ చేరుకుంటుంది. అలాగే మే 4, 11, 18, 25, జూన్‌ 1, 8, 15, 22, 29, జులై 6, 13, 20, 27 తేదీల్లో ఉదయం 5.30 గంటలకు మదురైలో బయలుదేరే వీక్లీ స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ (07192) మరునాడు ఉదయం 7.25 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. ఈ ట్రైన్లకు శనివారం ఉదయం 8 గంటల నుంచే రిజర్వేషన్‌ మొదలు కానుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img