Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

సాగునీటి వనరులతో తెలంగాణ పల్లెలు సస్యశ్యామలం : మంత్రి నిరంజన్‌రెడ్డి

ప్రభుత్వం కల్పించిన సాగునీటి వనరులతో తెలంగాణలో పల్లెలు సస్యశ్యామలముగా మారుతున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 77 మందికి రూ.21 .09 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘సంపద పెంచాలి. ప్రజలకు పంచాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆకాంక్ష’అని అన్నారు . 60ఏండ్లలో సాధ్యం కానిది ఎనిమిదేళ్లలో చేసి చూయించారని అన్నారు.సంక్షేమం, అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే నంబర్‌ వన్‌ గా నిలుస్తుందని వెల్లడిరచారు. మునుగోడు ఎన్నికలలో అత్యధిక మెజారిటీ అందించినందుకు మంత్రి నిరంజన్‌ రెడ్డి పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు సన్మానించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img