Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

సాయి గణేశ్‌ ఆత్మహత్య వ్యవహారంలో మంత్రి పువ్వాడకు హైకోర్టు నోటీసులు

ఖమ్మంలో బీజేపీ కార్యకర్త సాయి గణేశ్‌ ఆత్మహత్య కేసులో రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్‌కు హైకోర్టు నోటీసులు జారీచేసింది. ఆయనతోపాటు కేంద్ర హోంశాఖ, ఖమ్మం సీపీ, త్రీటౌన్‌ ఎన్‌హెచ్‌వో, సీబీఐ, ఖమ్మం తెరాస నేత ప్రసన్న కృష్ణ, సీఐ సర్వయ్యకు ఉన్నత న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది. రెండు వారాల్లోగా ఆ నోటీసులకు స్పందించాలని హైకోర్టు పేర్కొంది. ఈ మేరకు సాయి గణేశ్‌ ఆత్మహత్యపై సీబీఐ దర్యాప్తును కోరుతూ దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టిన హైకోర్టు పై ఆదేశాలు జారీ చేసింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img