మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై సోమువీర్రాజు
తెలంగాణ మంత్రి కేటీఆర్కు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కౌంటర్ ఇచ్చారు. ‘నన్ను సారాయి వీర్రాజు అన్నవారు ఏం తాగుతారో నాకు తెలుసు. నాపై ట్వీట్ చేసిన కేటీఆర్ తండ్రి తెల్లవారుజాము దాకా ఏం చేస్తారు?.. నేను సారాయి వీర్రాజును కాదు.. బియ్యం వీర్రాజును.. సిమెంట్ వీర్రాజును… కోడిగుడ్ల వీర్రాజును’ అని చెప్పారు. పేదోడిని దృష్టిలో పెట్టుకునే తాను లిక్కర్పై మాట్లాడానని చెప్పారు. . రూ.50కి లిక్కర్ అమ్మితే.. ప్రతి పేద కుటుంబానికి ఏడాదికి రూ.2 లక్షలు మిగులుతాయని అన్నారు. తాను చేస్తున్న ప్రతి వ్యాఖ్య 2024 బీజేపీ మేనిఫెస్టోలో పెడతామని స్పష్టంచేశారు. గుంటూరు జిన్నా టవర్, విశాఖ కింగ్జార్జ్ ఆస్పత్రి పేర్లు మార్చాలని డిమాండ్ చేశారు. లేకుంటే 2024 అధికారంలోకి వచ్చాక తామే మారుస్తామన్నారు.