Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

సింగరేణిపై కేంద్రం కక్ష : ఎమ్మెల్యే బాల్క సుమన్‌

సింగరేణిపై కేంద్రం కక్ష కట్టిందని ఎమ్మెల్యే బాల్క సుమన్‌ అన్నారు. తెలంగాణ విద్యుత్‌ అవసరాలు తీర్చడంలో సింగరేణి ప్రముఖ పాత్ర పోషిస్తోందని తెలిపారు. సింగరేణిపై బీజేపీ కన్నుపడి కుట్రలకు పాల్పడుతోందని విమర్శించారు. నాలుగు బొగ్గు బ్లాకులను ప్రైవేట్‌పరం చేసే ఆలోచన చేస్తోందన్నారు. కేంద్రం కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతరేకంగా కార్మికులకు మద్దతుగా తాము సమ్మెలో పాల్గొన్నామని చెప్పారు. బొగ్గు బ్లాకులను వేలం వెయొద్దని సీఎం కేసీఆర్‌ ఇప్పటికే ప్రధానికి లేఖ రాశారని తెలిపారు. గుజరాత్‌లో మినరల్‌ డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌కు లిగ్నైట్‌ బ్లాకులను వేలం లేకుండా అప్పగించారని తెలిపారు. ఈ నాలుగు బొగ్గు బ్లాకులను వేలం వేయకుండా ప్రభుత్వానికి అప్పగించమని కోరితే ఇవ్వటం లేదని మండిపడ్డారు .గుజరాత్‌ కు ఒక నీతి…తెలంగాణకు ఒక నీతా అని ప్రశ్నించారు. మోదీకి మిత్రులైన అదానీకి అప్పగించేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు.దీనిపై కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి స్పందించాలని బాల్క సుమన్‌ డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img